Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకరత్న పరువు తీస్తున్న దాసరి అరుణ్ కుమార్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (17:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న దివంగత దాసరి నారాయణరావు పరువును ఆయన తనయులు గంగలో కలుపుతున్నారు. ఇప్పటికే దాసరి తనయులు ఆస్తుల విషయంలో రోడ్డున పడ్డారు. ఇపుడు హీరో దాసరి అరుణ్ కుమార్ మరోమారు వార్తలకెక్కారు. పీకల వరకు మద్యం సేవించి నానా హంగామా చేశారు. ఈ ఘటన బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, రోడ్ నంబరు 12లోని సయ్యద్ నగర్‌కు బుధవారం రాత్రి వెళ్లారు. ఆ సమయంలో మద్యంమత్తులో ఉన్న ఆయన తన వాహనంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కారు కూడా దెబ్బతింది. 
 
దీంతో ద్విచక్రవాహనదారులు దాసరి అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆయనపై ఐపీసీ 279, 336 సెక్షన్లతో పాటు.. మోటారు వాహన చట్టంతో పాటు.. డ్రంకెన్ డ్రైవ్ కింద కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆయన గురువారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments