Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గ్రేట్, 8 గ్రామాలను దత్తత తీసుకుని...

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:20 IST)
లాక్ డౌన్‌తో చాలామంది నిరుపేదల పరిస్థితి ధీనంగా మారిపోతోంది. తినడానికి తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాతలు అందరూ ముందుకు వచ్చినా కొంతమంది నిరుపేదలకు మాత్రం పూర్తిస్థాయిలో భోజనం అందడం లేదు. అయితే పట్టణాల్లో కొంతమంది దాతలు సహాయం చేస్తూ వారికి అండగా ఉంటున్నారు.
 
కానీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయం. పట్టణాల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు  చేయలేక..గ్రామాల్లో చెట్ల కింద కూర్చుని నానా బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం సినీనటుడు మోహన్ బాబు ప్రత్యేకంగా అన్నదానం చేస్తున్నారు.
 
చిత్తూరుజిల్లా రంగంపేటలోని తన సొంత విద్యాసంస్ధలైన రంగంపేటకు చుట్టుప్రక్కల ఉన్న 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు మోహన్ బాబు, మంచు విష్ణు. నేటి నుంచి ప్రతిరోజు 8గ్రామాల ప్రజలకు భోజనం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పంపిణీ చేయడంతో పాటు 8 టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు. 
 
ఇలా లాక్ డౌన్ ముగిసేంత వరకు నిరుపేదలకు సేవ చేస్తానంటున్నారు మోహన్ బాబు. స్వయంగా మంచు విష్ణు ఆహార పొట్లాలను గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతుల ధీనస్థితిని చూసిన విష్ణు స్వయంగా బట్టలను కూడా అందజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments