Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గ్రేట్, 8 గ్రామాలను దత్తత తీసుకుని...

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:20 IST)
లాక్ డౌన్‌తో చాలామంది నిరుపేదల పరిస్థితి ధీనంగా మారిపోతోంది. తినడానికి తిండిలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాతలు అందరూ ముందుకు వచ్చినా కొంతమంది నిరుపేదలకు మాత్రం పూర్తిస్థాయిలో భోజనం అందడం లేదు. అయితే పట్టణాల్లో కొంతమంది దాతలు సహాయం చేస్తూ వారికి అండగా ఉంటున్నారు.
 
కానీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయం. పట్టణాల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు  చేయలేక..గ్రామాల్లో చెట్ల కింద కూర్చుని నానా బాధలు పడుతున్నారు. అలాంటి వారి కోసం సినీనటుడు మోహన్ బాబు ప్రత్యేకంగా అన్నదానం చేస్తున్నారు.
 
చిత్తూరుజిల్లా రంగంపేటలోని తన సొంత విద్యాసంస్ధలైన రంగంపేటకు చుట్టుప్రక్కల ఉన్న 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు మోహన్ బాబు, మంచు విష్ణు. నేటి నుంచి ప్రతిరోజు 8గ్రామాల ప్రజలకు భోజనం మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పంపిణీ చేయడంతో పాటు 8 టన్నుల కూరగాయలను అందజేస్తున్నారు. 
 
ఇలా లాక్ డౌన్ ముగిసేంత వరకు నిరుపేదలకు సేవ చేస్తానంటున్నారు మోహన్ బాబు. స్వయంగా మంచు విష్ణు ఆహార పొట్లాలను గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది రైతుల ధీనస్థితిని చూసిన విష్ణు స్వయంగా బట్టలను కూడా అందజేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

కాంచీపురం వకుళ సిల్క్స్.. దివ్వెల మాధురి కొత్త వ్యాపారం (video)

తిరగబడుతున్న అమెరికా కల, అక్కడున్న విద్యార్థికి నెలకి లక్ష పంపాల్సొస్తోంది

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments