మలయాళ రీమేక్.. వెండితెరపై పవన్-రానా కాంబో‌.. నివేదా థామస్ హీరోయిన్‌గా..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (11:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పవన్ ఇప్పటికే 'వకీల్ సాబ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా హిందీ సినిమా పింక్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ఇంకొన్ని రోజుల్లో మొత్తం షూటింగ్ ముగియనుంది.
 
ఈ సినిమా తర్వాత ఆయన మలయాళ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' తెలుగు రీమేక్‌ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట. ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో కీలక పాత్రలో రానా నటిస్తున్నాడని టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అధికారికంగా ప్రకటన విడుదలైంది.
 
మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా అయితే బాగుంటుందని భావించిన చిత్రబృందం.. రానాను ఆ క్యారెక్టర్ కోసం చిత్రబృంద సంప్రదించిదట. ఆ పాత్రకు రానాకు కూడా నచ్చడంతో.. నటించడానికి రానా ఒకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో రానా సరసన నివేధా నటించే అవకాశం ఉందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

15 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా పట్టేశాడో చూడండి (video)

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments