మంచు లక్ష్మి దంపతుల 'జూనియర్ కుప్పన్న' రెస్టారెంట్ ప్రారంభం
నటి, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరొందిన మంచులక్ష్మి అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడు చూసినా లక్ష్మినే కనిపిస్తుంది, తన భర్త ఎక్కువగా ఎక్కడా కనిపించడు అనుకునే వాళ్ల కోసమే ఏమో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స
నటి, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాతగా పేరొందిన మంచులక్ష్మి అన్ని రంగాల్లోనూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడు చూసినా లక్ష్మినే కనిపిస్తుంది, తన భర్త ఎక్కువగా ఎక్కడా కనిపించడు అనుకునే వాళ్ల కోసమే ఏమో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడిన లక్ష్మి భర్త ఆనంద్ ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెట్టి, అందరి కంటా పడనున్నాడు. ‘జూనియర్ కుప్పన్న’ పేరుతో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించనున్నాడు.
ఈ ఫ్రాంచైజ్లో మొదటి రెస్టారెంట్ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో మంచు మోహన్ బాబు ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. నాకు ఎప్పటినుంచో ఫైవ్స్టార్ హోటల్ పెట్టాలన్న నా కోరికను మా తండ్రికి చెప్పగా, ఆయన హోటల్ ఎందుకు నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదైనా స్కూల్ కట్టించు అన్నాడు. ఆ నేపథ్యంలోనే నేను శ్రీ విద్యానికేతన్ను మొదలుపెట్టి నా తండ్రి కోరికను నెరవేర్చాను. కానీ నా కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు నా కోరికను మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, అల్లుడు ఆనంద్ నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉంది.
జూనియర్ కుప్పన్న ఫ్రాంచైజీని ఎంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దొరికే ప్రతి వంటకం, ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఒకసారి తింటే నెలజీతం మొత్తం ఈ రెస్టారెంట్కే అంకితమిచ్చేలా ఉంటుందన్నారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ను హైదరాబాద్లో మొదటిగా తామే పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. చెన్నై, బెంగుళూరులలో జూనియర్ కుప్పన్న రెస్టారెంట్ గురించి, ఆ రుచి తెలియని వారుండరు.
నేను బెంగుళూరు వెళ్తే కుప్పన్నకు వెళ్లకుండా, వచ్చేదే ఉండదు. మెడిటేషన్ మైండ్కు, కుప్పన్న కడుపుకు అనే ఫార్ములాను మాత్రం అక్కడున్నప్పుడు నేను తప్పకుండా ఆచరించే ఫార్ములా. మా అదృష్టం కొద్దీ కుప్పన్న ఓనర్ నాకు మంచి ఫ్రెండ్ కావడంతో, మాకు ఈ ఫ్రాంఛైజ్ దొరికింది. ప్రతి ఒక్కరికి ఇంటి రుచిని మరిపించే విధంగా ఈ రెస్టారెంట్ను హైదరాబాదీయులకు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. కార్యక్రమంలో మోహన్ బాబుతో సహా, మంచు వారసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.