Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స మాట‌ల‌కు సినీ పెద్ద‌ల మండిపాటు!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:59 IST)
సినిమా టికెట్ల‌పై ఎ.పి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన కౌంట‌ర్‌పై సినీ ప‌రిశ్ర‌మ మండిప‌డుతోంది. గురువారంనాడు విజ‌య‌న‌గ‌రంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడిన‌ప్పుడు సినిమా టికెట్ల ధ‌ర సామాన్యుల‌కు అందుబాటులో తేవ‌డ‌మే ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బందికి గురిచేయ‌డం కాద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కారు. ఇష్టానుసారం టిక్కెట్లు పెంచితే ప్ర‌భుత్వం ఊరుకోద‌ని అన్నారు.
 
దీనిపై గురువారం ఫిలింఛాంబ‌ర్‌లో సినీప్ర‌ముఖులు చ‌ర్చ జ‌రిగింది. సామాన్యుల‌కు అందుబాటులో అనే నెపంతో ఎ.పి. ప్ర‌భుత్వం చేస్తున్న చ‌ర్య‌ను దుయ్య‌బ‌ట్టారు. ఎ.పి. పాల‌న‌లో సామాన్యుడికి అందుబాటులోనే అన్నీ వున్నాయా? వారు ఎన్నో స‌మ‌స్య‌లపై పోరాడుతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లున్న ప్ర‌భుత్వం వైన్ షాపుల‌లో ఇష్టానుసారంగా రేట్లు పెంచ‌డం, డూప్లికేట్ మందులు విక్ర‌యించ‌డం వంటివి వారికి వ‌ర్తించ‌వా? అంటూ ఘాటుగా చ‌ర్చ సాగింది. అదేవిధంగా సామాన్యుడికి అందుబాటులో వుంటే ఎ.పి.లో డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు పెంచుకున్నారంటూ.. ఎద్దేవ చేశారు. ఇలా ప్ర‌భుత్వం అనాలోచిత చ‌ర్య‌కు సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టే బ‌లి అవుతుంద‌ని వారు వాపోతున్నారు. ఏదిఏమైనా దీనిపై అంద‌రూ ఒక్క‌తాటిపై రావాల్సిన అవ‌స‌రం వుంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments