Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొత్స మాట‌ల‌కు సినీ పెద్ద‌ల మండిపాటు!

Government of Andhra Pradesh
Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (15:59 IST)
సినిమా టికెట్ల‌పై ఎ.పి. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన కౌంట‌ర్‌పై సినీ ప‌రిశ్ర‌మ మండిప‌డుతోంది. గురువారంనాడు విజ‌య‌న‌గ‌రంలో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడిన‌ప్పుడు సినిమా టికెట్ల ధ‌ర సామాన్యుల‌కు అందుబాటులో తేవ‌డ‌మే ప్ర‌భుత్వం ధ్యేయ‌మ‌ని పేర్కొన్నారు. ప‌రిశ్ర‌మ‌ను ఇబ్బందికి గురిచేయ‌డం కాద‌ని స‌న్నాయి నొక్కులు నొక్కారు. ఇష్టానుసారం టిక్కెట్లు పెంచితే ప్ర‌భుత్వం ఊరుకోద‌ని అన్నారు.
 
దీనిపై గురువారం ఫిలింఛాంబ‌ర్‌లో సినీప్ర‌ముఖులు చ‌ర్చ జ‌రిగింది. సామాన్యుల‌కు అందుబాటులో అనే నెపంతో ఎ.పి. ప్ర‌భుత్వం చేస్తున్న చ‌ర్య‌ను దుయ్య‌బ‌ట్టారు. ఎ.పి. పాల‌న‌లో సామాన్యుడికి అందుబాటులోనే అన్నీ వున్నాయా? వారు ఎన్నో స‌మ‌స్య‌లపై పోరాడుతుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లున్న ప్ర‌భుత్వం వైన్ షాపుల‌లో ఇష్టానుసారంగా రేట్లు పెంచ‌డం, డూప్లికేట్ మందులు విక్ర‌యించ‌డం వంటివి వారికి వ‌ర్తించ‌వా? అంటూ ఘాటుగా చ‌ర్చ సాగింది. అదేవిధంగా సామాన్యుడికి అందుబాటులో వుంటే ఎ.పి.లో డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లు ఎందుకు పెంచుకున్నారంటూ.. ఎద్దేవ చేశారు. ఇలా ప్ర‌భుత్వం అనాలోచిత చ‌ర్య‌కు సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టే బ‌లి అవుతుంద‌ని వారు వాపోతున్నారు. ఏదిఏమైనా దీనిపై అంద‌రూ ఒక్క‌తాటిపై రావాల్సిన అవ‌స‌రం వుంద‌ని పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan With Vijayamma: వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియలకు విజయమ్మ-జగన్

Krystyna Pyszkova: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్జ్కోవా (video)

ఓటర్ గుర్తింపు - ఆధార్ కార్డుల అనుసంధానానికి కేంద్రం పచ్చజెండా!

వరంగల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి.. తెలంగాణలో డుం.. డుం.. డుం.. (Video)

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ప్రారంభం- బాబు, పవన్ కూడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments