Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరింత శక్తివంతంగా 3 రాజధానులు బిల్లుతో వస్తాం: బొత్స సత్యనారాయణ

మరింత శక్తివంతంగా 3 రాజధానులు బిల్లుతో వస్తాం: బొత్స సత్యనారాయణ
, సోమవారం, 22 నవంబరు 2021 (17:01 IST)
మూడు రాజధానుల లొల్లి ముగియలేదని చెప్పకనే చెప్పారు ఏపీ మంత్రులు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బిల్లుల ఉపసంహరణపై ప్రసంగం ముగిశాక, మంత్రులు ఎవరికివారు దానిపై స్పందించారు. ముఖ్యంగా బిల్లు విషయంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ బిల్లుకు చిక్కులు తప్పవన్న అభిప్రాయాల నేపథ్యంలో ప్రస్తుత బిల్లు వెనక్కి తీసుకోవడమే మంచిదని ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 
3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము 3 రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదన్నారు. ప్రస్తుత బిల్లుపై చిన్నచిన్న అపోహలు వున్నాయనీ, వాటిని సరిదిద్ది మరింత శక్తివంతంగా ఈసారి 3 రాజధానుల బిల్లుతో వస్తామన్నారు.

 
కనుక అమరావతి రాజధాని అనేది కేవలం కొన్నాళ్లు మాత్రమే. ఇంకా 3 రాజధానుల అంశం ముగిసిపోలేదని తేటతెల్లం అయ్యింది. కనుక అమరావతి రైతులు స్వీట్లు పంచున్నప్పటికీ చేదు గుళికలు సిద్ధమవుతాయన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో వస్తాం... జగన్