Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గలగలగల గ్లాస్‌మేట్సు'.... "చిత్రలహరి" రెండో సాంగ్ రిలీజ్

Chitralahari
Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:07 IST)
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం "చిత్రలహరి". 'నేను శైలజ' ఫేమ్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌లు నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం వచ్చే నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన 'పరుగు పరుగు' పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోనే రెండో పాట క్లాస్‌మేట్స్, సోల్‌మేట్స్, రూమ్‌మేట్స్ ఇలా అందరికి ఎక్కడో చోట ఫుల్‌స్టాప్ ఉంటుంది కాని.. ఏ ఎండు లేని వాడే మందు పంచుకునే గ్లాస్‌మేట్స్.. గలగలగల గలగలగల గ్లాస్‌మేట్సూ.. అంటూ సాగే ఈ పాట మందు బాబులను ఎంతో ఆకట్టుకునేలా ఉంది. 
 
ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, పెంచల్ దాస్, దేవీశ్రీ ప్రసాద్‌లు ఆలపించారు. యూత్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోయేలా ఉంది. అంతేకాదు ఈ పాటలో సునీల్‌తో కలిసి సాయి ధరమ్ తేజ్ చేసిన అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. 
 
ఇకపోతే, ఈ చిత్రం పాటలోని ఆడియోలో ఎవరికీ తెలియని ఓ అమ్మాయి ఓ వాయిద్యాన్ని వాయిస్తూ కనిపిస్తుంది. ఆ వాయిద్యాన్ని సారంగి అంటారు. దాన్ని వాయిస్తున్న అమ్మాయి పేరు మనోన్మణి. దక్షిణాది భారతదేశం నుంచి ఈ వాయిద్యాన్ని వాయించిన తొలి మహిళ మనోన్మణి. ఈ చిత్ర నిర్మాతలు రంగస్థలం వంటి భారీ హిట్ చిత్రం తర్వాత నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments