Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

Webdunia
బుధవారం, 17 మే 2023 (12:50 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత పీకేఆర్ పిళ్లై (92) కన్నుమూశారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన.. త్రిశూర్ జిల్లా మందన్‌చిరలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హీరో మోహన్ లాల్‌తో కలిసి అధిక చిత్రాలు నిర్మించిన ఘనత పిళ్లైకే దక్కింది.
 
షిర్డిసాయి క్రియేషన్స్ బ్యానరుపై అమృతం గమ్య, చిత్రం, వందనం, కిళక్కునరుమ్, పక్షి, అహం వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఈయన నిర్మించిన చిత్రాల్లో చిత్రం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా, మోహన్ లాల్ హీరోగా నటించారు. ఈ చిత్రం 200కు పైగా చిత్రాల్లో 300 రోజుల పాటు ప్రదర్శించబడింది. 
 
ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లోకి రీమేక్ చేశారు. తెలుగులో అల్లుడుగారు పేరుతో రీమేక్ చేశారు. 12 సంవత్సరాల క్రితం ముంబైలోని తన వ్యాపారాన్ని వదిలేసి కేరళాకు వచ్చి స్థిరపడిన పిళ్లై... 1984లో మలయాళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత సొంత బ్యానరును స్థాపించి దానిపై అనేక చిత్రాలు నిర్మించారు. మొదట ఎర్నాకుళంలో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన కుటుంబంతో సహా త్రిశూర్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రమ్మ, రాజేష్, ప్రీతి, సోను అనే పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments