Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి-సుక్కు యాడ్ అదిరిందిగా.. (video)

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (16:10 IST)
ప్రముఖ దర్శకుడు సుకుమార్ "పుష్ప-2" పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి "ఆచార్య" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, రామ్ చరణ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. 
 
ఈ సినిమా మాత్రమే కాకుండా మెగాస్టార్ ఖాతాలో భోళా శంకర్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. వరుసగా సినిమా షూటింగులతో బిజీగా ఉన్న చిరు త్వరలోనే "ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేయనున్నారు.
 
ఈ నేపథ్యంలో సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్ చేస్తున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెగాస్టార్‌ చిరంజీవి ఈ యాడ్ చేస్తున్నట్టు వారే స్వయంగా వెల్లడించారు కూడా. అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. 
 
తాజాగా బయటకు వచ్చిన ఈ యాడ్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యాడ్‌లో మెగాస్టార్‌తో పారు ఖుష్బూ, అనసూయ భరద్వాజ్ కన్పించగా, ఒక మంచి ట్విస్ట్‌తో హ్యాపీ న్యూస్‌ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments