ఇదేంటి 'ఆచార్య' : అపుడు అలా.. ఇపుడు ఇలా లీక్ చేస్తే ఎలా?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (13:04 IST)
మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి మరోమారు నిజం వెలువడింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం కథ ఏ కోణంలో సాగుతుందో బహిరంగంగా చెప్పేశారు. దీంతో చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయింది. నిజానికి ఈ చిత్రను దర్శకుడు కొరటాల శివగానీ, ఇతర యూనిట్ సభ్యులుగానీ ఎక్కడా లీక్ చేయలేదు. చివరకు హీరో చిరంజీవి నోటి వెంట నుంచి బయటకు రావడం గమనార్హం. గతంలో కూడా చిత్ర టైటిల్‌ను కూడా చిరంజీవే తొందరపడి వెల్లడించారు. ఓ చిత్ర ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న చిరంజీవి.. తాను నటిస్తున్న తాజా చిత్రం ఆచార్యలో అంటూ చెప్పారు. దీంతో కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం పేరు టైటిల్ అని మీడియా ఖరారు చేసింది. చివరకు ఆ టైటిలే చిత్ర టైటిల్‌గా మారింది. ఇపుడు చిత్ర కథను కూడా చిరంజీవి లీక్ చేయడం గమనార్హం. 
 
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 152వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ - మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతుండగా ఆయనకి జంటగా పూజా హెగ్డే నటిస్తోందట. ఇక ఈ సినిమా మే 13న దేశ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ని ఫ్లోలో మెగాస్టార్ రివీల్ చేశారు. 
 
ఆ తర్వాత ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ చరణ్ ఆ పాత్రని చేయబోతున్నట్టు మెగాస్టార్ పొరపాటున చెప్పేశాడు. తాజాగా ఆచార్య సినిమాకి సంబంధించిన మరొక కీలకమైన విషయాన్ని బయట పెట్టేశాడు. 
 
ఆచార్య సినిమా దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కథలో నక్సల్స్ నేపథ్యం కూడా ఉంటుందని ప్రచారం జరుగుతూ పలు రకాల రూమర్స్ వస్తున్నాయి. 
 
కానీ దర్శకుడు.. మిగతా యూనిట్ సభ్యులుగానీ ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. అయితే తాజాగా రానా దగ్గుబాటి నటించిన "విరాట పర్వం" సినిమా టీజర్‌ను మెగాస్టార్ రిలీజ్ చేశారు.  
 
ఆ సమయంలోనే 'విరాట పర్వం' టీజర్ చూస్తుంటే నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కిందనిపిస్తోంది. మా 'ఆచార్య' సినిమా కూడా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్ అనేశాడు. దీంతో ఇన్నాళ్ళు రూమర్స్ అనుకున్న విషయాన్ని మెగాస్టార్ రివీల్ చేసి నిజం చేశాడని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు అగ్నిప్రమాదంలో ఇద్దరు టెక్కీలు మృతి

Kurnool : కర్నూలు బస్సు ప్రమాదం.. డ్రైవర్ కనిపించలేదు.. ఏఐ వీడియో వైరల్

కర్నూలు బస్సు ప్రమాదం : సీటింగ్ అనుమతితో స్లీపర్‌గా మార్చారు...

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments