Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ వారికి భారత సంతతి పౌరుడు ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు?

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:48 IST)
బ్రిటీష్ వారికి భారత సంతతికి చెందిన పౌరుడు ప్రధానమంత్రి అవుతారని ఎవరు ఊహించారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఆయన మంగళవారం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఆయనతో బ్రిటన్ రాజు చార్లెస్-2 ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రిషి సునక్ ఎంపికై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమతమ సందేశాలు, అభినందనలను ట్విట్టర్ వేదిక ద్వారా షేర్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో చిరంజీవి ఒకరు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"భారతదేశం బ్రిటీష్ (ఆంగ్లేయులు)వారి నుంచి స్వాతంత్ర్యం పొంది 75 యేళ్లు జరుపుకుంటున్న శుభ తరుణంలో బ్రిటిష్ వారికి భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి ప్రధానమంత్రి, అదీ కూడా మొట్టమొదటి హిందూ ప్రధాని అవుతారని ఎవరు ఊహించారు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments