కాలేజీ డేస్‌ల్లో మహిళలను తాకడానికి బస్సెక్కేవాడిని.. బిగ్ బాస్ కంటిస్టెంట్

Webdunia
సోమవారం, 29 జులై 2019 (18:42 IST)
కాలేజీ రోజుల్లో మహిళలను తాకడానికే బస్సులు ఎక్కేవాళ్లమని బిగ్ బాస్ తమిళ కంటిస్టెంట్, నటుడు శరవణన్ చేసిన కామెంట్స్‌పై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఫైర్ అయ్యారు. తమిళ బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటిస్టెంట్‌గా వున్న శరవణన్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈయన ఈ వారంతం వ్యాఖ్యాత కమల్ హాసన్‌తో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. 
 
ఈ వారాంతంలో భాగంగా నటి మీరామిథున్ దర్శకుడు చేరన్‌పై చేసిన ఆరోపణలపై కమల్ హాసన్ మాట్లాడారు. టాస్క్ సందర్భంగా చేరన్ తనను ఇబ్బందికరంగా లాగి పక్కకు తోశాడని మీరామిథున్ ఆరోపించగా.. ఆ సందర్భంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడాడు. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళే అవసరంలో ఒకరినొకరు తోస్తూ వెళ్తుంటారు. 
 
అంతేకాదు.. కావాలనే మహిళలను తాకాలని బస్సుల్లో కొందరు అడ్డంగా తిరుగుతుంటారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో శరవణన్ తన చేతిని పైకెత్తి.. తాను కూడా కాలేజీ డేస్‌లో మహిళలను తాకేందుకు బస్సు ఎక్కుతానని చెప్పాడు. దీంతో వివాదంలో చిక్కాడు. దీంతో షాకైన కమల్.. శరవణన్ నిజం ఒప్పుకున్నాడని కామెంట్ చేశాడు. 
 
ఈ చర్చకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన చిన్మయి.. శరవణన్ కామెంట్స్‌ను తప్పుబట్టింది. ఇలాంటి వ్యక్తిని ఓ రియాల్టీ షోలో వుంచడం అవసరమా అంటూ అడిగింది. మహిళలను తాకడానికి బస్సులెక్కేవారని శరవణన్ అంటుంటే.. మహిళలు కూడా క్లాప్స్ కొట్టడం ఏమిటని చిన్మయి ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments