Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూతో జూ.బాలకృష్ణ మృతి: కన్నీటి పర్యంతమైన యాంకర్ అనసూయ

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:06 IST)
జూనియర్ బాలకృష్ణగా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయికృష్ణ డెంగ్యూ జ్వరం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గోకుల్ సాయి మరణ వార్తపై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉద్వేగానికి లోనయ్యారు. తామంతా సాయికృష్ణను జూనియర్ బాలకృష్ణ అని పిలుచుకునేవారమని గుర్తు చేసుకున్నారు. 
 
అతడి మరణ వార్తను జీర్ణించుకోవడం సాధ్యం కావడంలేదంటూ ఉద్వేగానికి లోనైంది. డెంగ్యూ జ్వరం చాలా భయంకరమైనదని ఆమె చెప్పింది. గోకుల్ కుటుంబానికి ఇది తీరని లోటనీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
 
ప్రతి ఒక్కరూ డెంగ్యూ గురించి తెలుసుకోవాలనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించింది అనసూయ. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం కోసం వెళ్లడం కంటే అసలు డెంగ్యూ రాకుండా నివారణ మంచిదని చెప్పారు. డెంగ్యూ దోమలు లేకుండా చేసేందుకు ప్రభుత్వ అధికారులందరూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments