Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త ఆర్నావ్‌తో నాకు నా బిడ్డకు హాని.. నటి దివ్యా శ్రీధర్

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:21 IST)
Divya
కోలీవుడ్ సీరియల్ నటి దివ్యా శ్రీధర్ వార్తల్లో నిలిచింది. తన భర్త ఆర్నావ్ నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణహాని వుందని చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
 
వివరాల్లోకి వెళితే.. తమిళ్ సీరియల్ సెవ్వంధీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్య. సీరియల్‌లో తనతో పాటు నటించిన ఆర్నావ్‌తో ప్రేమలో పడింది. కొన్నేరోజులు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టారు.
 
అయితే ఆర్నావ్ కొన్ని నెలలు బాగానే ఉన్నా ఆ తరువాత మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం దివ్యకు తెలియడంతో అందరి ముందు భర్తను నిలదీసి తమ పెళ్లిని లీగల్ చేస్తూ గుడిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆర్నావ్‌లో మార్పు రాలేదు. 
 
మరో నటితో రాసలీలలు చేస్తూ దివ్య కంటపడ్డాడు. దీంతో ఆమె మరోసారి అతడిని నిలదీయడంతో అతడు ఎదురుతిరిగాడు. ఆమెను, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి ప్రయత్నించడంతో ఆమె పోలీసుల సాయం కోరింది.
 
తన భర్త వేరొక నటితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను వదిలించుకోవాలనిచూస్తున్నాడని, అతని వలన తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో తెలిపింది. 
 
ఇక దివ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దివ్య అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments