టాలీవుడ్ సినీ రచయితపై వేధింపుల కేసు!

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (08:59 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ రచయితపై కేసు నమోదైంది. భార్యను వేధించినందుకుగాను మూవీ రైటర్ యర్రంశెట్టి రమణ గౌతమ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషనులో వేధింపుల కేసు నమోదైంది.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఎన్బీటీ నగర్‌లో నివసించే యర్రంశెట్టి రమణ ‌గౌతమ్ అదే ప్రాంతానికి చెందిన యువతి (24)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పొడసూపడంతో గతేడాది జూన్‌లో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో తిరిగి కలిసి ఉండేందుకు అంగీకరించారు.
 
ఈ క్రమలో గత కొంతకాలంగా రమణ గౌతమ్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అదేసమయంలో భార్యకు ఫోన్లు చేసి బెదిరించడం మొదలు పెట్టాడు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆమె నగ్న చిత్రాలను యూట్యూబ్‌లో పెడతానని బెదిరిస్తుండడంతో యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఆయనపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments