Webdunia - Bharat's app for daily news and videos

Install App

GOAT నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు.. ఏం చేసిందంటే..?

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (12:05 IST)
Parvati Nair
కోలీవుడ్ హీరోయిన్, గోట్ నటి పార్వతి నాయర్‌పై కేసు నమోదు అయ్యింది. పార్వతి నాయర్ ఇంట్లో పనిచేస్తున్న తనను దొంగతనం నెపంతో గదిలో బంధించి ఆమె స్నేహితులతో కలిసి టార్చర్ చేసిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హీరోయిన్ పార్వతి నాయర్, అయాలా చిత్ర నిర్మాత కొడప్పాడి రాజేష్ సహా ఏడు మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
అసలు విషయానికి వస్తే.. నటి పార్వతి నాయర్ చెన్నైలోని నుంగంబాక్కంలో నివసిస్తున్నారు. 2022లో తన ఇంట్లో రూ.10 లక్షల విలువైన వాచ్‌లు, ఐఫోన్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
అయితే తనపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారంటూ పార్వతి నాయర్ ఇంట్లో పనిచేసే వ్యక్తి సుభాష్ ఫిర్యాదులో చేశాడు. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని.. తనను గదిలో బంధించి కొట్టారని.. పార్వతి నాయర్ తోపాటు మరో ఏడుగురిపై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించాడు బాధితుడు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుభాష్ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

Nara Lokesh Deputy CM: నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చేయాలి.. చంద్రబాబుతో శ్రీనివాస్ రెడ్డి

తిరుమల ఆలయ అలంకరణ చేస్తుంటే చెరిపేస్తారా?: తితిదే అధికారులపై దాత సునీత ఆగ్రహం

NTR: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఆశిస్తున్నాం.. మంత్రి నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments