Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణరావు కుమారులపై కేసు.. అప్పు తీసుకెళ్లలేదని..?

Webdunia
శనివారం, 31 జులై 2021 (12:38 IST)
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారులపై పోలీసులకు కేసు నమోదైంది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పును చెల్లిస్తామని.. చెప్పి ఇప్పుడు ఆయన కుమారులు మొహం చాటేశారని సోమశేఖర్ అనే బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2012 సంవత్సరంలోనే రెండు కోట్ల పది లక్షల రూపాయలు దాసరి నారాయణరావు అప్పు తీసుకున్నారని ఈ ఫిర్యాదు పేర్కొన్నాడు బాధితుడు సోమశేఖర్.
 
అయితే… 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు మరణం తర్వాత.. పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తామని ఆయన కుమారులు అరుణ్, ప్రభులు ఇద్దరు మాట ఇచ్చారని బాధితుడు సోమశేఖర్ పోలీసులకు విన్నవించాడు. ఈ నేపథ్యంలోనే.. రెండు కోట్ల పది లక్షలకు బదులు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని దాసరి నారాయణరావు కుమారులు అంగీకారం తెలిపారని బాధితుడు చెప్పాడు.
 
ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments