Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి నారాయణరావు కుమారులపై కేసు.. అప్పు తీసుకెళ్లలేదని..?

Case
Webdunia
శనివారం, 31 జులై 2021 (12:38 IST)
సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారులపై పోలీసులకు కేసు నమోదైంది. దాసరి నారాయణరావు తీసుకున్న అప్పును చెల్లిస్తామని.. చెప్పి ఇప్పుడు ఆయన కుమారులు మొహం చాటేశారని సోమశేఖర్ అనే బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 2012 సంవత్సరంలోనే రెండు కోట్ల పది లక్షల రూపాయలు దాసరి నారాయణరావు అప్పు తీసుకున్నారని ఈ ఫిర్యాదు పేర్కొన్నాడు బాధితుడు సోమశేఖర్.
 
అయితే… 2018 నవంబర్ 13న దాసరి నారాయణ రావు మరణం తర్వాత.. పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తామని ఆయన కుమారులు అరుణ్, ప్రభులు ఇద్దరు మాట ఇచ్చారని బాధితుడు సోమశేఖర్ పోలీసులకు విన్నవించాడు. ఈ నేపథ్యంలోనే.. రెండు కోట్ల పది లక్షలకు బదులు గానూ కోటి 15 లక్షలు ఇస్తామని దాసరి నారాయణరావు కుమారులు అంగీకారం తెలిపారని బాధితుడు చెప్పాడు.
 
ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాలని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన కుమారులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments