Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి పేరు ప్రస్తావించకపోవడం విచారకరం : నిర్మాత సి.కళ్యాణ్

Webdunia
బుధవారం, 4 మే 2022 (11:23 IST)
మే ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన మే డే ఉత్సవాల్లో దివంగత దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణ రావు పేరును ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం విచారకరమని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ కార్మికోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 
 
దీనిపై సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దివంగత దాసరి నారాయణ రావు గురించి కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దాసరి నారాయణ రావు లేకుండా సినీ కార్మికులు లేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. సినీ కార్మికులు దాసరి, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డిలను విస్మరించడం సరికాదన్నారు. 
 
మరోవైపు, నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దండ వేయడం మరిచిపోయామన్నారు. తాము చేసింది తప్పేనని ఆయన అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments