Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి పేరు ప్రస్తావించకపోవడం విచారకరం : నిర్మాత సి.కళ్యాణ్

Webdunia
బుధవారం, 4 మే 2022 (11:23 IST)
మే ఒకటో తేదీన హైదరాబాద్ నగరంలో జరిగిన మే డే ఉత్సవాల్లో దివంగత దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణ రావు పేరును ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం విచారకరమని నిర్మాత సి.కళ్యాణ్ అన్నారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సినీ కార్మికోత్సవం జరిగింది. ఇందులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 
 
దీనిపై సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దివంగత దాసరి నారాయణ రావు గురించి కనీసం మాటమాత్రం కూడా ప్రస్తావించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. దాసరి నారాయణ రావు లేకుండా సినీ కార్మికులు లేరనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. సినీ కార్మికులు దాసరి, సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డిలను విస్మరించడం సరికాదన్నారు. 
 
మరోవైపు, నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ వివరణ ఇచ్చారు. సినీ కార్మికోత్సవంలో దాసరి నారాయణ రావు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దండ వేయడం మరిచిపోయామన్నారు. తాము చేసింది తప్పేనని ఆయన అంగీకరించారు. ఇకపై తాము ఏ కార్యక్రమం చేపట్టినా దాసరికి సముచిత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments