Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులు ఎక్కువ రావడం వల్లే తొక్కిసలాట... బన్నీ తప్పేమీ లేదు : బోనీ కపూర్

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (17:47 IST)
హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో "పుష్ప-2" ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. సంధ్య థియేటర్‌కు ప్రేక్షకులు భారీగా తరలి రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ తప్పేమీ లేదని, బన్నీని నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కు మంది జనాలు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెప్పారు. 
 
దక్షిణాది ప్రేక్షకులకు తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందన్నారు. తమిళ స్టార్ అజిత్ నటించిన ఒక సినిమాకు అర్థరాత్రి షోకు తాను వెళ్లాలనని, దాదాపు 20 వేలమంది థియేటర్ దగ్గర ఉన్నారని, సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారన్నారు. సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చినపుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు. 
 
అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి వారు నటించిన చిత్రాలకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీ కపూర్ తెలిపారు. జనాలు ఎక్కువ వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments