Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ మృతి కేసు : బాలీవుడ్ నటి రియా చక్రవర్తి భారీ ఊరట

వరుణ్
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (12:34 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో బాలీవుడ్ నటి, ఆమె ప్రియురాలు రియా చక్రవర్తి భారీ ఊరట లభించింది. రియా విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్‌ను సీబీఐ జారీ చేసింది. ఈ లుకౌట్ నోటీస్‌ను బాంబే హైకోర్టు జారీచేసింది. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్‌పై నాలుగు వారాలు పాటు స్టే విధించాలన్న సీబీఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. 
 
గత 2020 జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. అయితే, సుశాంత్‌‌ది ఆత్మహత్య కాదని, రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. 
 
ఈ క్రమలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలు రియా, ఆమె సోదరుడు షోవిక్, తండ్రి ఇంద్రజిత్ ఎదుర్కొన్నాడు. వీరిద్దరూ జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో వీరు విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా, లుకౌట్ సర్క్యులర్‌ను రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments