Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదికి దాసోహం అవుతున్న బాలీవుడ్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (14:46 IST)
ఒకప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీని బాలీవుడ్ చిన్నచూపు చూసేది. కానీ పరిస్థితి ఇప్పుడు బాగా మారిపోయింది. దక్షిణాదిలో ఏ సినిమా రిలీజై విజయం సాధించినా రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ జనాలు ఇక్కడకు వచ్చి వాలిపోతున్నారు. ఇక్కడి కథలు కూడా హిందీలో ఘన విజయం సాధిస్తుండటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో మార్పు వచ్చింది. 
 
అయితే హిందీలోకి రీమేక్ చేయబడిన తొలి దక్షిణాది సినిమాగా 'రాముడు భీముడు' రికార్డుకెక్కింది. అప్పటి నుండి బాలీవుడ్‌లో తెలుగు సినిమాల హవా ప్రారంభమైంది. సూర్య నటించిన గజినీ సినిమా బాలీవుడ్‌లో 100 కోట్లు వసూలు చేసింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. తెలుగు అగ్ర హీరోలు నటించిన అనేక చిత్రాలు బాలీవుడ్‌లో కూడా ఘన విజయం సాధించాయి.
 
మహేష్ బాబు 'పోకిరీ'ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా, విక్రమార్కుడు సినిమాను అక్షయ్ కుమార్, టెంపర్ సినిమాను రణ్‌వీర్ సింగ్ రీమేక్ చేసి హిట్టు కొట్టారు. తాజాగా టాలీవుడ్ సంచలన విజయాలు ఆర్ఎక్స్ 100, అర్జున్ రెడ్డి సినిమాలు, కన్నడలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన కిరాక్ పార్టీ సినిమా కూడా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments