Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.50 కోట్ల దావా వేసిన మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్!!

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (11:42 IST)
ఓ కార్ల కంపెనీపై మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ రిమీ సేన్ రూ.50 కోట్లకు దావా వేశారు. మెగాస్టార్ చిరంజీవి "అందరివాడు" సినిమాలో రిమీ సేన్ నటించారు. తాజాగా ఆమె తన రేంజ్ రోవర్ కారులో అనేక సమస్యలను ఎదుర్కొన్న క్రమంలో కారు ఉత్పత్తిదారులపై దావా వేసింది. లీగల్  చర్యల్లో  భాగంగా, నవనీత్ మోటార్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ, సతీష్ మోటార్స్‌లకు నోటీసులు పంపించారు. నోటీసు ఆమె అసలు పేరు, సుభమిత్ర సేన్ అని పేర్కొన్నారు. 
 
ఆగష్టు 25, 2022న, రిమీ సేన్ తన కారు వెనుక కెమెరా పనిచేయకపోవటంతో.. రివర్స్ చేస్తున్నప్పుడు పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనకు ముందు కూడా రిమీ సేన్ కారుతో అనేక సమస్యలను ఎదుర్కోవటం.. వాటిని పరిష్కరించే ప్రయత్నంలో అనేక సార్లు సంబంధిత డీలర్‌షిప్‌లను సందర్శించినా కానీ సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. 
 
తన వాహనంతో నిరంతర సమస్యలతో విసుగు చెందిన తరుణంలో మానసిక వేదనను గురయ్యానంటూ పరిహారంగా తనకు‌‌ నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులను జారీ చేసింది.  కారులో సమస్యల కారణంగా డీలర్ షిప్, కారు తయారీదారుల నుండి 50 కోట్లు పరిహారంతో పాటు వారిపై చట్టపరమైన ఖర్చులను నిమిత్తం మరో రూ.10 లక్షలు ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments