Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మన్ కోహ్లీ అరెస్టు

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (13:46 IST)
బాలీవుడ్ చిత్రసీమను డ్రగ్స్ కేసు వెంటాడుతూనేవుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారు. తాజాగా బాలీవుడ్ నటుడు అర్మాన కోహ్లీని ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సి.బి) అరెస్టు చేసింది. 
 
డ్రగ్స్ సప్లయర్ అజయ్ రాజు సింగ్‌తో కలిసి అర్మాన కోహ్లీ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతనివద్ద పలు కోణాల్లో విచారించిన తర్వాత అరెస్టు చేశారు. ముఖ్యంగా, ఈ విచారణలో లభించిన ప్రాథమిక ఆధారాలతో అర్మాన్‌ కోహ్లీ ఇంటిలో కూడా ఎన్.సి.బి. అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అర్మాన్ ఇంట్లో కొకైన్ లభ్య‌మైంది.
 
దీంతో అర్మాన్‌ కోహ్లీని కూడా ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆదివారం ఆయ‌న‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి జైలుకు తరలించారు. 
 
కాగా, సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' సినిమాలో అర్మాన్ న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే,  హిందీ "బిగ్‌ బాస్‌"లోనూ అర్మాన్‌ కోహ్లీ పాల్గొన్నాడు. ఆయ‌న‌కు దక్షిణ అమెరికా దేశాల నుంచి డ్ర‌గ్స్ అందిన‌ట్లు అధికారులు తేల్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments