Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ షూటింగ్

దేవి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:17 IST)
Dacoit- Anurag Kashyap
అడివి శేష్  పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'డకాయిట్' ఎక్సయిటింగ్ సినిమాటిక్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది. మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో కథానాయికగా ప్రకటించిన మేకర్స్ ఇప్పుడు తారాగణంలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ని రివిల్ చేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ ఫుల్ పాత్రలో చేరారు, నిజాయితీ, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన ఫియర్ లెస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించనున్నారు. చమత్కారం, వ్యంగ్యంతో కూడిన అతని పాత్ర యాక్షన్, ఎమోషన్, డ్రామాతో అలరించే కథనానికి డెప్త్ ని యాడ్ చేస్తుంది. 
 
క్యురియాసిటీని పెంచుతూ మేకర్స్ ఇంటెన్స్, యాక్షన్-ప్యాక్డ్ న్యూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తనకు ద్రోహం చేసిన తన మాజీ ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకునే ఓ వ్యక్తి ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తూ కథ ప్రేమ, ద్రోహం, ప్రతీకారం, భావోద్వేగ కథగా వుండబోతోంది. 
 
సినిమాలో చేరడం పట్ల అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. “అయ్యప్ప భక్తుడైన పోలీసు అధికారిగా నటించడం ఫన్ తో పాటు సవాలుతో కూడుకున్నది. విధికి వ్యతిరేకంగా ధర్మంతో పాటు తన పనిని హ్యుమర్ తో చేయడం అద్భుతంగా ఉంది. ఈ పాత్రను రెండు భాషలలో పోషించడానికి ఎదురు చూస్తున్నాను, హిందీలో, తెలుగులో షూటింగ్ చేస్తున్నాను. రెండు భాషలలో ఒకే ప్రభావాన్ని చూపడం సవాలుతో కూడుకున్నది, దిన్ని పూర్తిగా ఆనందిస్తున్నాను'అన్నారు
 
షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది, కథ, స్క్రీన్‌ప్లేను శేష్, షనీల్ డియో సంయుక్తంగా రూపొందించారు. ప్రస్తుతం, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మహారాష్ట్రలో లాంగ్ షెడ్యూల్‌తో కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments