Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌కి షాక్.. మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ... స్వాతి దీక్షిత్ వచ్చేస్తోంది..

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (10:40 IST)
బిగ్ బాస్‌కి షాక్ తగిలింది. మొదటివారం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్ సాధించిన బిగ్ బాస్ షోకు రెండో వారంలోనే షాక్ తగిలింది. తొలి వారంతో పోలిస్తే రెండో వారం బిగ్ బాస్ రేటింగ్స్ భారీగా తగ్గాయి. మరీ సీరియళ్ల స్థాయిలో బిగ్ బాస్ రేటింగ్స్ వస్తూ ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే రోబోల టీమ్, మనుషుల టీమ్ మధ్య జరిగిన టాస్కులో రోబోల టీమ్ విజయం సాధించింది.
 
బుద్ధిబలంతో రోబోల టీమ్ మనుషుల టీమ్‌ను ఓడించింది. రోబోల టీమ్‌కు చెందిన అవినాష్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ దగ్గర అతనికి తెలియకుండా ఛార్జింగ్ పెట్టుకున్నాడు. దీంతో ఎప్పుడూ కూల్‌గా కనిపించే మాస్టర్ చాలా సీరియస్ అయ్యాడు. జీవితంలో నాశనం అయిపోతావంటూ.. జన్మజన్మలు నాతో మాట్లాడొద్దంటూ మాస్టర్ శాపనార్థాలు పెట్టాడు ఆ తర్వాత మోనాల్ గంగవ్వ వేసుకున్న రోబో డ్రెస్ ను విసిరేసింది.
 
దీంతో గంగవ్వ తీవ్ర ఆగ్రహానికి గురై మోనాల్ పై కోపాన్ని వెళ్లగక్కింది. ఆహారం ఇస్తే చార్జింగ్ ఇస్తామని గంగవ్వకు మనుషుల టీమ్ చెప్పి ఆహారం తీసుకొని చార్జింగ్ ఇచ్చారు. అభి, గంగవ్వల దగ్గర ఛార్జింగ్ ఉండటంతో టాస్క్ ముగిసిందని రోబోల టీమ్ విన్ అయిందని బిగ్ బాస్ తెలిపాడు. రోబోల టీమ్ నుంచి కెప్టెన్సీ కోసం గంగ‌వ్వ‌, హారిక‌, అభిజిత్, అవినాష్ పోటీ చేయగా గంగవ్వ విన్ కావచ్చని వార్తలు వస్తున్నాయి.
 
మనుషుల టీమ్ లోని సభ్యులు నోయల్ చెత్త ఫెర్ఫామెన్స్ ఇచ్చాడని ముక్త కంఠంతో చెప్పారు. దీంతో బిగ్ బాస్ నోయల్‌కు జైలు శిక్ష విధించాడు. నోయల్ కు రాగిజావ మాత్రమే అది తప్ప ఇంకేం ఇవ్వకూడదని తెలిపాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని తెలిసేలా ప్రోమో వదిలాదు. శుక్రవారం బిగ్ బాస్ హౌస్‌లోకి స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇవ్వనుంది. జంప్ జిలానీ, బ్రేకప్, చిత్రాంగద సినిమాల్లోని పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న స్వాతి దీక్ష్తిత్ ఏ మేరకు ప్రేక్షకులను అకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments