బిగ్ బాస్ మూడో సీజన్.. పార్టీ చేసుకుంటున్న శివజ్యోతి.. ఫినాలేకు మెగాస్టార్?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (12:04 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ చివరి దశకు చేరుకుంది. తాజాగా శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. 
 
వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్‌కే అధికంగా ఉన్నాయని టాక్.
 
ఇకపోతే.. ప్రముఖ వీ6 ఛానెల్ తీన్ మార్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చేసింది. 14వ వారం చివర బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె హౌస్ నుంచి బయటకు రాగానే ఏమాత్రం ఫీల్ అవ్వకుండా హ్యీపీగా పార్టీ చేసుకుంది. 
 
బిగ్ హౌస్‌లో పరిచయం అయిన ఫ్రెండ్స్‌తో శివజ్యోతి దీపావళి సంబరాలు చేసుకుంది. మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో ఫ్రెండ్స్ అయినా అశు రెడ్డి, రవి కృష్ణ, రోహిణి, హిమజతో పాలు కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది శివజ్యోతి. వీరంతా సందడిగా టపాసులు పేల్చుతూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments