Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఐదో సీజన్.. షణ్ముఖ్ గ్రూప్‌తో తలనొప్పి.. నామినేషన్ తప్పదా?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (15:03 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది.  ఈ రియాల్టీ షో ఐదో వారానికి చేరుకుంది. ఇప్పటికే పలువురు వీక్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారు తమకు తోచిన స్ట్రాటజీలతో ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. అయితే హౌస్‌లో ఎక్కువగా గొడవలు మాత్రమే జరుగుతుండడం గమనార్హం. ఈరోజు కెప్టెన్ టాస్క్ కంటెండర్ల కోసం జరగనున్న ఫైట్ మాత్రం ఆసక్తిని రేపుతోంది.
 
ఇదిలా వుంటే.. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్ టాస్క్ జరిగింది. అందులో షణ్ముఖ్‌ను 8 మంది కంటెస్టెంట్‌లు నామినేట్ చేశారు. కాగా ఈ వారం తొమ్మిది మంది పోటీదారులు నామినేట్ అయ్యారు. వారిలో ప్రియా, మానస్, లోబో, యాంకర్ రవి, జశ్వంత్, షణ్ముఖ్, సన్నీ, విశ్వ, హమీదా ఉన్నారు. అయితే నామినేషన్ నుంచే మొదలైన రచ్చ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. 
 
ముఖ్యంగా హౌస్ లో గ్రూపిజం తయారయ్యింది. జశ్వంత్, షణ్ముఖ్, సిరి ఒక గ్రూప్ అయ్యి, ఒకే చోట కూర్చోవడం కన్పిస్తోంది. ఇక ఫుడ్ దగ్గర జరిగిన గొడవలో శ్రీరామ్ తప్పేమీ లేకపోయినా షణ్ముఖ్ గ్రూప్ కావాలనే అతనిపై విరుచుకు పడడం నెగెటివిటీని పెంచుతోంది. 
 
జశ్వంత్ చేసిన రాంగ్ కామెంట్ ఈ రచ్చకు కారణమైంది. షణ్ముఖ్ గ్రూప్ పై జశ్వంత్ వల్ల బాగానే ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. పైగా అతని ప్రవర్తనే అతన్ని ఈ వారం బయటకు వెళ్లేలా చేస్తుందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments