Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్వి అమ్మాయి అయినందువల్ల అలా అనుకుంటున్నారు... సామ్రాట్...

అందరూ అనుకుంటున్నట్లు తనకు, తేజుకు మధ్య ఏమీ లేదని, తనీష్‌తో ఎలా ఉన్నానో తేజుతో కూడా అలాగే ఉన్నానని చెప్పాడు. తనీష్‌ను హగ్ చేసుకున్నట్లే, కిస్ చేసినట్లే తేజుని కూడా చేసేవాడినని, కానీ తను అమ్మాయి అయినందు వలన అందరూ అలా అర్థం చేసుకున్నారన్నాడు సామ్రాట్.

Webdunia
గురువారం, 4 అక్టోబరు 2018 (17:41 IST)
బిగ్ బాస్ సీజన్ 2 ముగిసింది. ఒక్కో వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరి వారం ఇంట్లో అయిదుగురు. వీళ్లను ఫైనలిస్ట్‌లుగా ఖరారు చేసారు. ఇక గ్రాండ్ ఫినాలె రోజున అందరినీ ఎలిమినేట్ చేసి చివరిగా ఒకరిని విజేతగా ప్రకటించారు. ఈ అయిదుగురు సీజన్ మొత్తం ఇంట్లో ఉన్న సభ్యులు. ఎలిమినేటై బయటకు రాగానే బిజీబిజీగా ఇంటర్వ్యూలతో గడుపుతున్నారు. ఇక ఈ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్‌గా ఎంపికైన సామ్రాట్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
 
అసలు బిగ్ బాస్‌కు పిలుపు వచ్చే సమయానికి తను కుటుంబ సమస్యలు, నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నందున రాకూడదనుకున్నానని, తన తండ్రే ధైర్యం చెప్పి పంపారని సామ్రాట్ తెలిపారు. ఇక ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్యామల గారు బిగ్ బాస్‌లోకి సామ్రాట్‌ని ఎందుకు తీసుకున్నారు, అతను అలా ఇలా అని మొదట్లో అనుకున్నారని చెప్పాడు. కౌశల్ అంటే తనకేమీ కోపం లేదని, అతను చాలా క్రమశిక్షణగా ఉంటాడు. అది నాకు నచ్చుతుంది, కానీ అతను కుక్కలు అనేసరికి చాలా బాధ కలిగి అరిచానన్నారు. 
 
ఇక నాని గురించి చెబుతూ చాలా సరదాగా ఉంటారని, ఒక్కోసారి అందరికీ బాగా క్లాస్ పీకుతారని, ఎక్కువగా బలైన సభ్యుడు తనీష్ అని, నాని ఎపిసోడ్‌లో హాయ్ చెప్పే విధానాన్ని బట్టే క్లాస్ ఉంటుందో లేదో తెలిసిపోయేదని తన అనుభవాలను పంచుకున్నారు. తను ఫైనల్‌కి రావడమే టైటిల్ కొట్టినంత ఆనందంగా ఉందని, కౌశల్ గెలిచినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తనకు సంబంధించినంత వరకు విజేత గీతానే అని తెలిపారు.
 
ఇకపోతే బయట అందరూ అనుకుంటున్నట్లు తనకు, తేజుకు మధ్య ఏమీ లేదని, తనీష్‌తో ఎలా ఉన్నానో తేజుతో కూడా అలాగే ఉన్నానని చెప్పాడు. తనీష్‌ను హగ్ చేసుకున్నట్లే, కిస్ చేసినట్లే తేజుని కూడా చేసేవాడినని, కానీ తను అమ్మాయి అయినందు వలన అందరూ అలా అర్థం చేసుకున్నారని సామ్రాట్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments