Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోలో నెక్ట్స్ ఏం జరుగబోతోందంటే..? టార్గెట్ ఎవరు?

బిగ్ బాస్ ఇంట్లో ఊహించినదే జరిగింది. మూడోవారం తరువాత కిరీటి ఎలిమినేట్ అయ్యారు. గణేష్ వెళ్లిపోతారని ముందుగా భావించినా… సెలబ్రిటీ లను వదిలేసి సామాన్యుల కేటగిరీలో వచ్చిన వారిని ముందుగా పంపేస్తున్నారని బి

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (16:05 IST)
బిగ్ బాస్ ఇంట్లో ఊహించినదే జరిగింది. మూడోవారం తరువాత కిరీటి ఎలిమినేట్ అయ్యారు. గణేష్ వెళ్లిపోతారని ముందుగా భావించినా… సెలబ్రిటీ లను వదిలేసి సామాన్యుల కేటగిరీలో వచ్చిన వారిని ముందుగా పంపేస్తున్నారని బిగ్ బాస్ మీద వచ్చిన విమర్శను తప్పించుకునేందుకా అనేట్లు సెలబ్రిటీ కిరీటీని ఎలిమినేట్ చేశారు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేషన్ నిర్ణయిస్తున్నట్లు చెబుతున్నా… షో అవసరాలకు అనుగుణంగా కొన్ని ఫిక్సింగులు ఉంటాయన్నది బహిరంగ రహస్యం. అదే ఈ ఆదివారం జరిగింది.
 
కిరీటి వెళ్లిపోయేటప్పుడు హౌజ్‌మేట్స్ కళ్లలో బాధ, అభిమానం స్పష్టంగా కనిపించాయి. గతవారం కెప్టెన్ టాస్క్ సందర్భంగా కౌశల్ కళ్లలో నిమ్మకాయ పెట్టేందుకు కిరీటి ప్రయత్నించడంతో అతనిపై నెగెటివ్ అభిప్రాయం సర్వత్రా వెళ్లిపోయింది. దానివల్ల ఓట్లు తగ్గాయని నాని స్వయంగా వివరించారు. ఓట్లు తగ్గినా ఎక్కువ వచ్చినా కిరీటీని తప్ప ఇంకొకరిని బయటకు పంపలేని స్థితి బిగ్ బాస్‌ది.‌ వినోదం కోసం గీతా మాధురి ఇంట్లో ఉండటం అవసరం. ఇక గణేష్‌ను పంపితే అపవాదు వస్తుంది. దీంతో కిరీటీ బౌల్డ్ అయ్యారు.
 
ఇక ఆదివారం ఒక్కో ఇంటి సభ్యున్ని ఉద్దేశించి ఒక సినిమా పేరు చెప్పి అది ఆ సభ్యునికి సరిపోతుందా లేదా అని మిగతా సభ్యులను అడిగారు. ఇది అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమంటే… ఎవరినీ నొప్పించకుండా సరదాగానే తన పని పూర్తి చేశారు నాని. అందుకు నానిని అభినందించాలి. ఈ వారం బిగ్ బాంబ్ ఏమంటే‌… బాత్‌రూంలో ఉన్నప్పుడు మినహా మిగతా సమయమంతా బాక్సింగ్ గ్లౌజ్ చేతులకు ధరించే ఉండాలి. ఈ బాంబు గీతా మాధురిపైన పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments