Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి - 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఈ మృతికి సంతాపసూచకంగా 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను రద్దు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో సోమవారం రాత్రి ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, రాత్రి 8 గంటలకు ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సంతాపసూచకంగా ఈ ప్రిరిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
కాగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లతో పాటు విలన్ పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments