Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రి గౌతం రెడ్డి మృతి - 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు

Webdunia
సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (13:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం హఠాన్మరణం చెందారు. ఈ మృతికి సంతాపసూచకంగా 'భీమ్లా నాయక్' ప్రిరిలీజ్ ఈవెంట్ వేడుకను రద్దు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. దీంతో సోమవారం రాత్రి ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులోభాగంగా, రాత్రి 8 గంటలకు ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కానీ, ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతికి సంతాపసూచకంగా ఈ ప్రిరిలీజ్ వేడుకను రద్దు చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్ అధినేత నిర్మాత సూర్యదేవర నాగవంశీ వెల్లడించారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
కాగా, సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ - నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లతో పాటు విలన్ పాత్రలో దగ్గుబాటి రానా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారులో భార్య, ఆమె పక్కనే ప్రియుడు, కారు బానెట్ పైన మొగుడు (video)

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments