Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఏమిటి నీ ధైర్యం..? రోబో 2.0తోనే పెట్టుకుంటావా?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (14:58 IST)
అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలో న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క, సాక్ష్యం చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌లేదు. దీంతో ఎలాగైనా స‌రే భారీ విజ‌యం సాధించాలి.. కెరీర్లో ముందుకు వెళ్లాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. తాజాగా క‌వ‌చం అనే సినిమా చేసాడు. ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌రిచ‌యం అవుతున్నారు. 
 
ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఇందులో సాయి శ్రీనివాస్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టించాడు. అయితే... ఈ సినిమాను డిసెంబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఈ నెల 29న ర‌జ‌నీకాంత్ రోబో సీక్వెల్ 2.0 రిలీజ్ కానుంది. ర‌జ‌నీ - శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ కాబ‌ట్టి రెండు వారాలు క‌లెక్ష‌న్స్ ఎలాగూ ఉంటాయి. అందుచేత థియేట‌ర్స్ దొర‌కాలంటే కాస్త ఇబ్బందే.
 
అలాంటిది 2.0 రిలీజైన వారానికే క‌వ‌చం సినిమాతో బెల్లంకొండ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుండ‌టం విశేషం. మ‌రి.. ఇది క‌వ‌చం సినిమాపై వారికున్న న‌మ్మ‌క‌మా..? లేక 2.0 సినిమాపై అనుమాన‌మా..? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments