నేల టికెట్ బ్యాచ్.. కసి తీరకపోతే శవాన్ని లేపి చంపుతా : బాలకృష్ణ (Trailer)

టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను గురువారం రాత్రి చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘మేరా నామ్ తేడా.. తేడా

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (06:13 IST)
టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పైసా వసూల్'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను గురువారం రాత్రి చిత్రయూనిట్ విడుదల చేసింది.


‘మేరా నామ్ తేడా.. తేడా సింగ్.. దిమాక్ తోడా.. 36 దోపిడీలు..24 మర్డర్లు..36 స్టాపింగ్‌లు.. దిస్ ఈజ్ మై విజిబుల్ రికార్డ్ ఇన్ వికీపీడియా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంది.
 
అలాగే, మనది నేల టికెట్ బ్యాచ్.. కసి తీరకపోతే శవాన్ని లేపి మరి చంపేస్తా అంటూ చెప్పిన డైలాగ్స్ మూవీపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రియ నటిస్తున్నది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ సందర్భంగా హీరో బాలయ్య మాట్లాడుతూ.. ‘నన్ను ఎవరు? అని ఎవరైనా అడిగితే నేను ఏం సమాధానం చెబుతానో తెలుసా? ‘భారతీయుడు’ అని. మళ్లీ ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘తెలుగోడిని’ అని సమాధానం చెబుతా. ఇంకోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే..‘నందమూరి తారకరామారావు కొడుకుని’ అని చెబుతాను. మరోసారి ‘మీరు ఎవరు?’ అని ప్రశ్నిస్తే.. ‘ఎన్టీఆర్ అభిమానిని’ అని చెబుతాను’ అంటూ బాలకృష్ణ ఆసక్తికరంగా మాట్లాడారు. 
 
ఇకపోతే.. దర్శకుడు పూరీ జగన్నాథ్ తనను మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా అనుకుంటున్నారంటూ కామెంట్ చేశారని, దానికి కారణం.. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఈ చిత్ర నిర్మాత సవ్యంగా సమకూర్చడమేనని, అందుకే, ఈ ఉత్సాహం, స్పీడ్ అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. పూరీ జగన్నాథ్ తో తాను చేసిన మొదటి చిత్రమిదని, ‘పైసా వసూల్’ చేయడంలో ఈ చిత్రం దూసుకుపోతుందని బాలకృష్ణ అన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

హైదరాబాద్ నుంచి చెన్నైకి 3 గంటల్లో, బెంగళూరుకి 2 గంటల్లో... రైల్లోనే...

ట్రంప్ ఏం నోటితో గ్రీన్ ల్యాండ్ కావాలని అన్నాడో కానీ... అది కాస్తా కరిగిపోతోంది, ముప్పు అంచున ప్రపంచం

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

తర్వాతి కథనం
Show comments