Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేరా నామ్ తేడా - దిమాక్ తోడా' అంటున్న బాలయ్య... 'పైసా వసూల్' ట్రైలర్

'పైసా వసూల్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో డైలాగ్‌లతో హీరో బాలకృష్ణ ఇరగదీశాడు. మేరా నామ్ తేడా, దిమాక్ తోడా, కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ బాలయ్య చెప

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (05:55 IST)
'పైసా వసూల్' సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో డైలాగ్‌లతో హీరో బాలకృష్ణ ఇరగదీశాడు. మేరా నామ్ తేడా, దిమాక్ తోడా, కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌లు అభిమానులను అలరిస్తున్నాయి.


ఈ సినిమాలో బాలయ్య ఓ పాట కూడా పాడారు. సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. సంగీతం అనూప్ రూబెన్స్. శ్రియ, కైరా దత్, ముస్కాన్ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే ఆయన మొదటి సినిమాలో నటిస్తున్నట్టు ఉందని చెప్పారు. వీలైతే బాలకృష్ణతో మళ్లీ ఇంకో సినిమా చేయాలని ఉందని, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 
 
బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే మోక్షఙ్ఞ కన్నా చిన్నవాడిలా ఉన్నారంటూ పూరీ కితాబిచ్చారు. బాలయ్యకు బౌన్సర్లు అక్కర్లేదని, ఎందుకంటే, ఆయన అభిమానులను ఆయనే కంట్రోల్ చేయగలరని అన్నారు. 
 

సంబంధిత వార్తలు

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments