Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో ఉన్న నిర్మాతకు బాలయ్య భరోసా.. నేనున్నానంటూ...

చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మా

Webdunia
శనివారం, 24 ఫిబ్రవరి 2018 (19:46 IST)
చిత్ర పరిశ్రమలో నిర్మాతలు నష్టాలను చవిచూడటం సహజమే. అయితే, అలాంటి నిర్మాతలను ఏ కొద్దిమంది హీరోలు మాత్రమే ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. అలాంటి హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన తాజాగా ప్రముఖ నిర్మాతను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. సి. కళ్యాణ్. 
 
ఈయన తొలుత బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో "జై సింహా" పేరుతో ఓ చిత్రాన్ని తీయగా, అది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అలాగే, సాయిధరమ్ తేజ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో "ఇంటెలిజెంట్" చిత్రాన్ని తీశారు. ఇది కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. దీంతో నిర్మాత సి.కళ్యాణ్ నష్టాల ఊబిలో కూరుకునిపోయాడు. 
 
ఈనేపథ్యంలో సి.కళ్యాణ్ నిర్మాణంలో మరో సినిమా చేసి నష్టాల నుండి గట్టెక్కిస్తానని ఆయనకు మాటిచ్చినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి వి.వి వినాయక్ దర్శకత్వం వహించనుండగా, బాలయ్య బాబు హీరోగా నటించనున్నారు. పైగా, భారీ విజయం సాధించే దిశగా ఈ సినిమా కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments