Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊహాగానాలకు తెరదించిన మెగాస్టార్ - యువరత్న!!

ఠాగూర్
ఆదివారం, 25 ఆగస్టు 2024 (09:44 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ. గత కొద్ది రోజులుగా వీరిద్దరి కలయికపై ఏవేవో ఊహాగానాలు వస్తున్నాయి. వీటికి తాజాగా వీరిద్దరూ తెరదించారు. శుక్రవారం ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కుమారుడు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలు హాజరయ్యారు. ఆ తర్వాత వధూవరులను ఆశీర్వదించేందుకు చిరంజీవి వెళ్లుతోన్న క్రమంలో ఆయనను సోదరా అని బాలయ్య బాబు పిలిచారు. మీరు నా గురించి ఎన్నో మంచి మాటలు చెప్పారట.. చాలా సంతోషం‌ అని చిరంజీవితో బాలయ్య బాబు అన్నారు. 
 
కొద్దిసేపు మాట్లాడుకున్న వారిమధ్య మీరు నా అన్ స్టాపబుల్ షోకి రావాలని చిరంజీవి‌ని అడిగేశారు. వెంటనే చిరంజీవి కూడా ఖచ్చితంగా వస్తానని బాలయ్యకు మాటిచ్చెసారట. దశాబ్దాలుగా ప్రొషెషనల్‌గా పోటీపడిన ఈ ఇద్దరు హీరోలు... ఒకేసారి వీరి సినిమాలు రిలీజ్ అయితే అభిమానుల మధ్య ఎలాంటి పరిస్దితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అలాగే, చిరంజీవి వర్సెస్ బాలయ్య అంటూ రకరకాల కథనాలు, ఊహాగానాలు ఎన్నో చూశాం. కానీ వాటన్నింటినికి పుల్ స్టాప్ పెడుతూ శుక్రవారం చిరంజీవి - బాలయ్య బాబుల మధ్య ఓ స్నేహపూర్వక సందర్భం వెలుగు చూసింది. త్వరలో నటుడిగా స్వర్ణోత్సవ వేడుకను జరపుకోబోతున్న బాలకృష్ణ వేడుకకు చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరవబోతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను నిలిపివేసిన భారత్.. పాకిస్థాన్‌లో ఎండిపోతున్న డ్యామ్‌లు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments