Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రం నడపడంలో బాలయ్య మొనగాడు.. చిరంజీవి గిరంజీవి పనికిరాడు : బాబూ మోహన్

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (13:10 IST)
తెలుగు సినీ హాస్య నటుడు, మాజీమంత్రి బాబూ మోహన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 
 
బాలకృష్ణను మెచ్చుకుంటూ చిరంజీవి, గిరంజీవి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
''భైరవద్వీపం'' చిత్రంలో బాలకృష్ణ, నేను గుర్రాలపై వెళ్తుంటాం. గుర్రం నడపడంలో బాలకృష్ణ మొనగాడు. గుర్రాలపైకి ఎగిరి దూకుతుంటాడు. బాలకృష్ణ మాదిరి గుర్రాన్ని నడపడం చిరంజీవి, గిరంజీవి ఎవరికీ చేతకాదు. ఏం పట్టుకోకుండా జూలు పట్టుకుని గుర్రంపై పోతుంటాడు" అంటూ బాబూమోహన్ వ్యాఖ్యానించాడు. 
 
ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా ''తీటగాడు.. నేను తోకవైపు కూర్చుని నడుపుతుంటే.. నన్నొక తన్ను తన్నాడు" అని బాబూ మోహన్ అన్నాడు కానీ.. అది బాలయ్యనుద్దేశించా.. మరొకరి గురించా అన్నది స్పష్టత లేకపోయింది. 
 
చిరుతో పోలుస్తూ బాలయ్య గురించి బాబూ మోహన్ ఇలా పొగిడేసరికి నందమూరి అభిమానులకు ఈ వీడియో కనువిందుగా ఉంటే, మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఆగ్రహం తెప్పిస్తోంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments