Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని హీరో అవుతాడని ఆమె చెప్పారట.. ''అ''లో కాజల్ లుక్ ఇదే..

ఎంసీఏ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని నటుడు అవుతాడని చెప్పింది ఎవరో తెలుసా? నటి స్నేహ తల్లి. ఈ విషయాన్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినీ రంగంలో కెరీర్ అసిస్టెంట్ డైర

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (09:22 IST)
ఎంసీఏ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేచురల్ స్టార్ నాని నటుడు అవుతాడని చెప్పింది ఎవరో తెలుసా? నటి స్నేహ తల్లి. ఈ విషయాన్ని నాని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినీ రంగంలో కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిని ప్రారంభించానని, బాపు దర్శకత్వంలో వచ్చిన "రాధాగోపాళం" సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశానని వెల్లడించారు. ఆ సమయంలోనే స్నేహ తల్లి తనను చూసి నటుడు అవుతానని చెప్పారని నాని తెలిపారు. అయితే ఆవిడ సరదాగా అంటున్నారని అనుకునేవాడినని, ఆ తర్వాత నిజంగానే తాను నటుడిని అయ్యానని చెప్పాడు. 
 
బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తాను చేరినప్పుడు, తనకేమీ తెలియదని, ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకుని.. ఈ స్థాయికి ఎదిగానని నాని తెలిపారు. అలాంటి గొప్ప దర్శకుడి వద్ద పనిచేసే అవకాశం తనకు మొట్టమొదట్లోనే లభించడం మరువలేని విషయమని నాటి విషయాలను నాని గుర్తుచేసుకున్నారు.
 
ఇదిలా ఉంటే.. నాని నిర్మాతగా అవతారమెత్తనున్న సంగతి తెలిసిందే. 'అ' అనే చిత్రం నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తున్న నాని ఇందులో నటిస్తున్న ముఖ్య పాత్రలను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
 
ఈ చిత్రంలో రవితేజ చెట్టు పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. హీరో నాని చేప పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇందులో ఇంకా నిత్యా మీనన్, రెజీనా, శ్రీనివాస్ అవసరాల కూడా నటిస్తున్నారు. త్వరలో వీరి పాత్రలకు సంబంధించిన లుక్ విడుదల కానుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. కొత్త సంవత్సరం సందర్భంగా నానికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments