Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన అవతార్.. భారత్‌లో తొలి హాలీవుడ్ చిత్రం

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (18:39 IST)
జైమ్స్ కామెరూన్ రూపొందించిన చిత్రం అవతార్ : ది వే ఆఫ్ వాటర్ చిత్రం భారత్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా భారత్‌లో టాప్ 10లో ఉండగా, గత 2022 సంవత్సరంలో తొలిస్థానంలో నిలిచింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇప్పటివరకు రూ.454 కోట్లు వసూలు చేసి సినీ ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. అన్ని భారతీయ భాషల్లో కలిపి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.14,060 కోట్లను రాబట్టింది. అయితే, ఈ హవా సంక్రాంతి 14వ తేదీ తర్వాత తగ్గిపోనుంది. సంక్రాంతికి అనేక కొత్త చిత్రాలు దేశ వ్యాప్తంగా విడుదలవుతున్నాయి. 
 
దీంతో అవతార్ ప్రదర్శించే థియేటర్ల సంఖ్యతో పాటు కలెక్షన్లు కూడా తగ్గే అవకాశం ఉంది. గతంలో ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం భారత్‌లో రూ.438 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ రికార్డును అవతార్ బద్ధలుకొట్టింది. భారత్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హాలీవుడ్ చిత్రం నిలిచింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments