Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ఇంట దీపావళి గ్రాండ్ పార్టీ.. హాజరైన తారాలోకం...

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (16:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారతో కలిసి తొలి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఇంట గ్రాండ్‌గా విందు పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందు పార్టీలో అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా, ఈ ఫ్యామిలీ పార్టీలో తారక్, మహేశ్ బాబులు తమతమ సతీమణులతో పాటు విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు.
 
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు, దర్శకులు, సినీ నిర్మాతలు కూడా చెర్రీ దంపతులు ఇచ్చిన విందు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, "ఆర్ఆర్ఆర్" చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ ఛేంజర్" చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments