Webdunia - Bharat's app for daily news and videos

Install App

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా ప్లాన్ చేస్తోన్న అశ్వ‌నీద‌త్..!

వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర హీరోలంద‌రితో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించి ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి నిర్మాణ సంస్థ ఇటీవ‌ల కాలంలో బాగా వెన‌క‌బ‌డింది. ఇలాం

Webdunia
మంగళవారం, 15 మే 2018 (19:28 IST)
వైజ‌యంతీ మూవీస్ ఎలాంటి భారీ చిత్రాల‌ను అందించిందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అగ్ర హీరోలంద‌రితో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించి ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. అలాంటి నిర్మాణ సంస్థ ఇటీవ‌ల కాలంలో బాగా వెన‌క‌బ‌డింది. ఇలాంటి టైమ్‌లో ఈ సంస్థ నిర్మించిన మ‌హాన‌టి చిత్రం సంచ‌ల‌న విజయం సాధించింది. దీంతో ఈ సంస్థ‌కు పూర్వవైభ‌వాన్ని తెచ్చి పెట్టింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.
 
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఇకపై తమ బ్యానర్లో వరుస సినిమాలు నిర్మిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాగార్జున- నాని కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ మూవీ నిర్మిస్తున్నాం. ఆ త‌ర్వాత మ‌హ‌ష్ బాబుతో ఒక సినిమాను నిర్మించ‌నున్నాం. ఇది జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఆ తరువాత ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయనున్నామని అన్నారు.
 
ఈ సినిమాకి దర్శకుడు ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదనీ, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్‌తో నిర్మించిన కంత్రి, శ‌క్తి చిత్రాలు ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మ‌రి.. ఈసారి ఎన్టీఆర్‌తో స‌క్స‌స్‌ఫుల్ మూవీ తీస్తార‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments