Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇంద్ర' రీ రిలీజ్‌లోనూ రికార్డులు - ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (10:41 IST)
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా "ఇంద్ర" సినిమాను రీరిలీజ్​ చేశారు. ఈ చిత్రం రీ రిలీజ్​లోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా 'ఇంద్ర' చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిచి మెగాస్టార్​ చిరంజీవి సన్మానించారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీ దత్​, దర్శకుడు బి.గోపాల్​తో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథా రచయిత చిన్ని కృష్ణలు పాల్గొన్నారు. వీరందరికీ చిరు శాలువాలను కప్పి సన్మానించారు. అలానే అశ్వినీ దత్​కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. 
 
వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోపై సీనియర్​ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తారు. అందుకే ఈ పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చానని చిరంజీవి చెప్పారు. ఇక ఈ సన్మాన కార్యక్రమం పుర్తైన తర్వాత  అశ్వినీ దత్ 'ఇంద్ర', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త మద్యం విధానానికి ఏపీ మంత్రివర్గం సమ్మతం - సాక్షి పత్రికకు రూ.205 కోట్లు

కేంద్రం కీలక నిర్ణయం : జమిలి ఎన్నికలకు మోడీ మంత్రివర్గం సై!

వరంగల్‌లో పెరుగుతున్న వైరల్ ఫీవర్లు, డెంగ్యూ కేసులు

కేసీఆర్ విజయాలు ఎప్పటికీ చెరిగిపోవు.. కేటీఆర్

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments