కరోనా నుంచి కోలుకుంటున్న అరుణ్ పాండ్యన్.. అదో పీడకల!

Webdunia
శనివారం, 8 మే 2021 (11:27 IST)
Arun Pandian
ప్రముఖ నటుడు, నిర్మాత అరుణ్ పాండ్యన్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ విషయం అతని కుమార్తె కీర్తి సోషల్ మీడియాలో ధ్రువీకరించింది. ఓ రోజు రాత్రి తన తండ్రికి ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్‌కు వెళ్ళామని, అక్కడ కరోనా టెస్ట్ చేయగా, పాజిటివ్ అని తేలిందని కీర్తి చెప్పింది. 
 
ఆ తర్వాత దాదాపు పదిహేను రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండి అరుణ్ పాండ్యన్ చికిత్స తీసుకున్నారని తెలిసింది. అరుణ్ పాండ్యన్ షుగర్ పేషెంట్ కావడంతో ఏమౌతుందో అనే ఆందోళనకు వారు గురయ్యారట. 
 
అయితే... అప్పటికే వాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవడం వల్ల కరోనా తీవ్రత అంతగా లేకపోయిందని కీర్తి తెలిపింది. పదిహేను రోజుల తర్వాత కరోనా నెగెటివ్ అని తేలాక మరోసారి గుండె సంబంధిత పరీక్షలు చేసినప్పుడు రెండు వాల్వ్స్ లో 90 శాతం వరకూ బ్లాక్స్ ఉన్నాయనే విషయం బయటపడిందని, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లోనే మనో ధైర్యంతో తన తండ్రి యాంజోప్లాస్ట్ కు సిద్ధపడ్డారని, ఆపరేషన్ విజయవంతంగా జరిగి ఇప్పుడు కోలుకుంటూ ఉన్నారని కీర్తి చెప్పింది.
 
తన తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే స్పందించి, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు కీర్తి ధన్యవాదాలు తెలిపింది. ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్య విషయమై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరూ వాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ ధరించాలని కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధం.. భర్తను అలా హత్య చేయించిన భార్య.. చివరికి?

వరంగల్, విజయవాడ జాతీయ రహదారులు అనుసంధానించే ప్రాజెక్టు

ఉత్తరాది వ్యాపారుల కారణంగా రాయలసీమ అరటిపండ్లకు భారీ డిమాండ్

పొగమంచు: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఒకదానికొకటి ఢీ.. నలుగురు మృతి

దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments