Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకే రెబెల్ స్టార్.. ఆయన మనసు చాలా మంచిది : ఏపీ మంత్రి రోజా

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:10 IST)
అనారోగ్యం కారణంగా మృతి చెందిన సీనియర్ హీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై ఏపీ మంత్రి, సినీ నటి ఆర్.కె.రోజా స్పందించారు. ఆయన పేరుకే రెబెల్ స్టార్.. కానీ ఆయన మనస్సు చాలా మంచిదంటూ కితాబిచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. 
 
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు భౌతికకాయానికి ఆమె నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, కృష్ణంరాజుతో కలిసి తాను ఒకే ఒక్క చిత్రంలోనే నటించానని, అయినప్పటికీ తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారని చెప్పారు. 
 
సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఉండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశారమని చెప్పారు. 
 
ముఖ్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనను ఎంతో ఎంకరేజ్ చేశారని చెప్పారు. ఈ రోజు ఆయన లేరనే వార్త విని చాలా బాధపడ్డారని చెప్పారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటని చెప్పారు. ప్రకృతిని బలంగా నమ్మి, ప్రేమించిన వ్యక్తి అని చెప్పారు. 
 
అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణంరాజు కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కృష్ణంరాజు భౌతికకాయానికి రోజా ఈరోజు నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments