Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భందాల్చాను ఏం చేద్దామన్న బాలిక.. ద్వారకా తిరుమల తీసుకెళ్లి పెళ్లి చేసుకున్న టీచర్...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్ల

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (14:12 IST)
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పాఠాలు బోధించే కీచక మాస్టర్ పాలిటెక్నిక్ చదివే విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని ద్వారకా తిరుమల తీసుకెళ్లి మెడలో మూడు ముళ్లు వేసి ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ టీచర్‌ను బాలిక బంధువులు పట్టుకుని చితక్కొట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పోలీసులకు పట్టించారు.
 
కర్నూలుకు చెందిన కారె రాంబాబు ఆరేళ్ళుగా ఏలూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీషు, సైన్సు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన ఓ బాలిక.. ప్రస్తుతం పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. 
 
ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బాధిత విద్యార్థిని రాంబాబును నిలదీయడంతో ద్వారకాతిరుమల తీసుకెళ్లి ఈనెల 18వ తేదీన పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఈనెల 21వ తేదీ రాత్రి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు రాంబాబుపై దాడి చేసి కొట్టిన ఘటన సంచలనమైన విషయం తెల్సిందే. దీనిపై ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి రాంబాబును అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం