Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ని ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తారు... పీపుల్ స్టార్ వ్యాఖ్య

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:51 IST)
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న విజ‌యం సాధించ‌డం.. కేసీఆర్ రెండోసారి సీఎం అవ్వ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పైన సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు సాయంత్రం సూప‌ర్ స్టార్ కృష్ణ కేసీఆర్‌ని అభినందిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అయితే.. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. కేసీఆర్‌ని అభినందించింది. సినీ ప్ర‌ముఖులు కొంతమంది ప‌ర్స‌న‌ల్‌గా మ‌రి కొంతమంది సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసుకుని కేసీఆర్‌ని అభినందిస్తున్నారు. 
 
పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ మూర్తి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన అనంతరం నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్ల పాలన చూసి టీఆర్ఎస్‌ను 88 స్థానాల్లో ప్రజలు గెలిపించారని, ఉద్యమం తర్వాత కూడా తెలంగాణలో కేసీఆర్ వేవ్ నడుస్తోందని అన్నారు. ప్రజలకు అమోఘమైన పాలన అందించాలని కేసీఆర్‌ని కోరానని, భారత రాజకీయాల్లో కూడా ఆయన సేవల అవసరం ఉందని.. కేసీఆర్‌ను ఏపీ ప్రజలు కూడా ఆదరిస్తార‌న్నారు.

సంబంధిత వార్తలు

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments