Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రివిక్రమ్ సినిమా ఓవర్.. ఇక జక్కన్న సినిమాకూ ఎన్టీఆర్‌‍కు ట్రైనర్ ఆయనే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శరీరాకృతి చక్కగా మారిపోనుంది. ఫిట్‌నెస్ కోసం ఎన్టీఆర్ క

Webdunia
మంగళవారం, 1 మే 2018 (18:23 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ శరీరాకృతి చక్కగా మారిపోనుంది. ఫిట్‌నెస్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్‌తో కనిపించనున్నాడు.


ఇందుకోసం ఆయన లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో తన లుక్‌తో పాటు శరీరాకృతిని మార్చుకున్నాడు. డైట్ విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. కండలు కూడా పెంచుకున్నాడు. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. 
 
త్రివిక్రమ్ సినిమా లుక్‌తోనే ఎస్ఎస్ రాజమౌళి చిత్రంలో యంగ్ టైగర్ కనిపించరని.. జక్కన్న చిత్రంలో వేరొక లుక్‌లో ఎన్టీఆర్ కనిపిస్తారని తెలుస్తోంది. బాక్సర్‌గా ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుందని.. ఈ సినిమా కోసం కూడా లాయిడ్ స్టీవెన్స్‌నే జక్కన్న రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. త్రివిక్రమ్ మూవీని ఎన్టీఆర్ పూర్తిచేసిన వెంటనే స్టీవెన్స్ హైదరాబాద్‌లో వాలిపోతాడని సమాచారం. 
 
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కోసం స్టీవెన్స్ సమక్షంలోనే ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 20కేజీల బరువును తగ్గించుకున్నాడు. ఇక ట్రైనింగ్ పిరియడ్ ముగియడంతో స్టీవెన్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పారు. 
 
ఈ సందర్భంగా స్టీవెన్స్ ఓ ట్వీట్ చేశారు. ''తారక్‌తో వర్క్ చేయడం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందని.. తారక్ కొత్త లుక్ కోసం తాను ఆతృతగా వున్నానని.. త్వరలోనే మళ్లీ కలుద్దామంటూ స్టీవెన్స్ ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ థ్యాంక్యూ సార్ అని రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను బట్టి జక్కన్న మూవీకి కూడా యంగ్‌టైగర్‌కు ట్రైనర్‌గా స్టీవెన్స్ వ్యవహరిస్తారని తెలుస్తోంది

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments