Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 200 కోట్లు కొల్ల‌గొట్టిన రంగ‌స్థ‌లం..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రంగ‌స్థ‌లం 3

Webdunia
మంగళవారం, 1 మే 2018 (18:13 IST)
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం రంగ‌స్థ‌లం. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన రంగ‌స్థ‌లం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న రంగ‌స్థ‌లం 3 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తే... 30 రోజుల‌కు 200 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి మ‌రో రికార్డ్ సొంతం చేసుకుంది.
 
ఇక షేర్ విషయానికొస్తే... ఇప్పటివరకు ఈ సినిమా రూ.116 కోట్ల షేర్‌ను రాబట్టుకుని డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాల్ని అందించింది. ఇప్పటికీ సి సెంటర్లలో మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌టం విశేషం. ఓవర్సీస్‌లో 3.5 మిలియన్ డాలర్లకు దగ్గరైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని పలు ఏరియాల్లో నాన్ బాహుబలి-2 రికార్డుల్ని క్రియేట్ చేసింది. మ‌గ‌ధీర త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌కి ఆ స్థాయిలో విజ‌యాన్ని అందించింది రంగ‌స్థ‌లం.

సంబంధిత వార్తలు

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments