Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది బిగ్‌బాస్ కాదు.. బ్రోతల్ హౌస్ : యాంకర్ శ్వేతా రెడ్డి

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (10:01 IST)
దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన రియాల్టీ షో బిగ్ బాస్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ రియాల్టీ షోకు మంచి ఆదర ఉంది. ఈ బుల్లితెర రియాల్టీ షోపై ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. అది బిగ్‌బాస్ కాదనీ, బ్రోతల్ హౌస్ అంటూ మండిపడింది. పైగా, ఈ రియాల్టీ షో పేరుతో నిర్వహించే బ్రోతల్ హౌస్‌ను బ్యాన్ చేయాలంటూ ఆమె డిమాండ్ చేసింది. 
 
తెలుగులో బిగ్ బాస్ -3 సీజన్ త్వరలో ప్రారంభంకానుంది. దీనికి హోస్ట్‌గా అక్కినేని నాగార్జున వ్యవహరించనున్నారు. దీనిపై శ్వేతా రెడ్డి స్పందిస్తూ, ఈ సీజన్-3లో పాల్గొనేందుకు తనను సంప్రదించి, ఎంపిక చేశారన్నారు. ఆ తర్వాత తమ కోరిక తీర్చాలని కోరారని చెప్పారు. బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేస్తేనే అవకాశం లభిస్తుందని చెప్పారని, అంటే.. బిగ్‌బాస్ పేరిట బ్రోతల్ హౌస్ నడుస్తోందని ఆమె ఆరోపించారు. 
 
ఒక విధంగా చెప్పాలంటే క్యాస్టింగ్ కౌచ్‌కు బిగ్ బాస్ కేంద్రంగా మారిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందువల్ల ఈ షోను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బిగ్ బాస్ ముసుగులో జరుగుతున్న వాటిని బయటపెట్టడానికే తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చినట్టు శ్వేతా రెడ్డి చెప్పారు. గత ఏప్రిల్‌‌ నెలలో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని, బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌కు ఎంపిక చేశామని చెప్పారని, ఎందుకని అడిగితే, పాప్యులర్‌ యాంకర్‌ కాబట్టి తీసుకున్నామని చెప్పారని తెలిపారు.
 
ఆపై కార్యక్రమ సమన్వయకర్త రవికాంత్‌ తనకు పలుమార్లు ఫోన్ పిలిపించి మాట్లాడారని, ఒప్పందం కుదుర్చుకునే సమయంలో తాను సంతకాలు కూడా చేశానని శ్వేతారెడ్డి తెలిపారు. అయితే, అ ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలు తనకు ఇవ్వలేదని ఆరోపించారు. ఆపై తమ బాస్‌‌ను ఇంప్రెస్‌ చేయాలని కార్యక్రమ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌ తనను అడిగారని, తానెందుకు ఇంప్రెస్‌ చెయ్యాలని నిలదీశానని చెప్పారు. హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా రావాలని తనకు ఫోన్ల మీద ఫోన్లు చేసిన రఘు, రవికాంత్‌, శ్యామ్‌ ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments