Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగదిక్కు లేదు కదా.. అండగా ఉంటాననేవాడు... యాంకర్ శ్యామల

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (11:39 IST)
ప్రముఖ యాంకర్ శ్యామల.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమెకు ఎదురైన సమస్యలను పూసగుచ్చిటన్టు వివరించారు. తన కెరీర్ తొలి రోజుల్లో అనేక మంది నుంచి వేధింపులు ఎదుర్కొనట్టు చెప్పారు. ముఖ్యంగా, మగ దిక్కులేడు కదా.. నేను తోడుగా ఉంటానని పలువురు వ్యాఖ్యానించారన్నారు. ప్రేమ ప్రతిపాదనలతో పదేపదే ఇబ్బంది పెట్టేవారన్నారు. ఓ కెమెరామెన్ అర్థరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 
 
సినిమాల్లో నటించాలన్న కోరికతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాం. ముందుగా సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో అక్కడ నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోను సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగులో కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టి పదేపదే ఇబ్బందికి గురిచేసేవారు. అవన్నీ నేను తట్టుకోలేక ఒప్పందం చేసుకున్న పలు సీరియల్స్‌ను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 
 
ఆ సమంయలో ఓ కెమెరామెన్ బాగా వేధించేవాడు. అర్థరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాకు తెప్పించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది. అపుడు అతడు మీకు మగ దిక్కు లేదు కదా మీ కోసం ఏమైనా చేస్తాను. మీ కూతురికి ఆ విషయం అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పిన దానికి అంగీకరిస్తే ఏదైనా చేయడానికి వెనకాడను అని అన్నాడు. దీంతో మా అమ్మ అతడు ఏదైనా హాని చేస్తాడేమోనని భయపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఒత్తిడి చేసింది. కానీ, నేను అలాంటివి పట్టించుకోలేదు. ధైర్యంగా ఉండమని అమ్మకు ధైర్యం చెప్పాను. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి అని ఆమె వెల్లడించారు. ఇపుడు యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vada Share : వడ షేర్ చేసుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments