Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుందట?

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:47 IST)
యాంకర్, యాక్టర్‌గానూ అనసూయ మెప్పిస్తోంది. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని.. ఇతర సంగతులను, అభిమానులతో పంచుకుంటూ వుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో అనసూయ రాస్తూ నేనో వారియర్.. అంతేకాకుండా కనిపించని శత్రువుతో కనిపించే యుద్ధం చేస్తున్నానని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియో కూడా పోస్టు చేసింది. 
 
ఆ వీడియో ఓ పక్షి కుర్చీలపై ఎక్కుతూ కనిపించింది. ఆ వీడియోను చూసినవారంతా అనసూయ ఓ పక్షి గురించి చెప్తోంది. ఆ వీడియోలో తాను పెంచుకుంటున్న ఓ పక్షి కింది నుండి పైన ఉన్న టేబుల్‌పైకి రావాడానికి నానా తంటాలు పడుతోంది. దీంతో అదంతా తన ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసిన అనసూయ ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పక్షిని ఓ యుద్ద వీరునితో పోల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. యాంకరింగ్ చేస్తూనే వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. అందులో భాగంగానే అనసూయ అడవి శేష్ 'క్షణం', రామ్ చరణ్, సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ఒకవైపు డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'కు మంచి టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments