Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుందట?

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (10:47 IST)
యాంకర్, యాక్టర్‌గానూ అనసూయ మెప్పిస్తోంది. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని.. ఇతర సంగతులను, అభిమానులతో పంచుకుంటూ వుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ పోస్టు చేసింది. ఆ పోస్టులో అనసూయ రాస్తూ నేనో వారియర్.. అంతేకాకుండా కనిపించని శత్రువుతో కనిపించే యుద్ధం చేస్తున్నానని రాసుకొచ్చింది. అంతేకాకుండా ఓ వీడియో కూడా పోస్టు చేసింది. 
 
ఆ వీడియో ఓ పక్షి కుర్చీలపై ఎక్కుతూ కనిపించింది. ఆ వీడియోను చూసినవారంతా అనసూయ ఓ పక్షి గురించి చెప్తోంది. ఆ వీడియోలో తాను పెంచుకుంటున్న ఓ పక్షి కింది నుండి పైన ఉన్న టేబుల్‌పైకి రావాడానికి నానా తంటాలు పడుతోంది. దీంతో అదంతా తన ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసిన అనసూయ ఆ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పక్షిని ఓ యుద్ద వీరునితో పోల్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. యాంకరింగ్ చేస్తూనే వీలున్నప్పుడల్లా సినిమాల్లో నటిస్తూ మంచి నటిగాను పేరు తెచ్చుకుంది. అందులో భాగంగానే అనసూయ అడవి శేష్ 'క్షణం', రామ్ చరణ్, సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టింది. ఒకవైపు డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తోంది. తాజాగా ఈ భామ నటించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'కు మంచి టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ- రష్యా బంపర్ ఆఫర్.. ఏంటది?

Travel Bag: 2 నెలల గర్భవతిని హత్య చేశాడు.. ట్రావెల్‌ బ్యాగ్‌లో కుక్కి పారేశాడు..

Man Mums, ఒక్కసారి వాటేసుకుంటే రూ. 600 చెల్లిస్తున్న యువతులు, ఎందుకిలా?

AP ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Drunk man: తాగిన మత్తులో పక్కింటి మహిళను భార్యగా భావించి ఏం చేశాడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments